కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఇవాళ(బుధవారం) ఆ పార్టీ అగ్రనేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జాతీయ జెండాలు పట్టుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మద్దతుగా వందేమాతరం అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న భారత బలగాలకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ, వేపాడ చిరంజీవి, టీడీపీ నేతలు వర్ల రామయ్య, అశోక్ బాబు, ఏవీ రమణ, బుచ్చిరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ని ప్రతీ భారతీయుడు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఉగ్రవాదానికి ప్రతీగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకునే ఏ నిర్ణయమైనా ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమరావతి పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు స్పష్టం చేశారని అన్నారు. మన సైన్యానికి యావత్ భారతావని అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa