ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో లష్కరే తోయిబా అగ్రనేత హాఫీజ్ రౌఫ్ ప్రత్యక్షం

international |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 08:48 PM

భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం, ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది. ఈ ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలకు పాకిస్థాన్ ప్రభుత్వం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం, ఈ కార్యక్రమాలకు లష్కరే తోయిబా అగ్ర కమాండర్ హాఫీజ్ అబ్దుల్ రౌఫ్, పలువురు సైనికాధికారులు హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని భారత్ సహా పలు దేశాలు ఆరోపిస్తున్నప్పటికీ, తాము కూడా ఉగ్రవాద బాధితులమేనని పాకిస్థాన్ తరచూ పేర్కొంటోంది. అయితే, తాజాగా 'ఆపరేషన్ సిందూర్' లో మరణించినట్లు చెప్పబడుతున్న ముష్కరులకు పాకిస్థాన్ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ఈ వాదనలను బలహీనపరుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa