పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యలుంటాయని తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. బుధవారం అర్థరాత్రి 1.44 గంటలకు భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాక్లో ఉగ్రస్థావరాలే టార్గెట్గా దీన్ని మొదలు పెట్టారు. దీనిలో భాగంగా భారత సాయుధ దళాలు మంగళవారం అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ప్రాంతంలోని కొన్ని భాగాలపై కూడా దాడి మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ సిందూర్పై స్పందించారు.
ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మాకు ఆపరేషన్ సిందూర్ గురించి కాసేపటి క్రితమే తెలిసింది. అక్కడ (భారత్-పాక్ దేశాల మధ్య) చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇది త్వరగా ముగిసిపోవాలని ఆశిస్తున్నా’’ అని ఆయన అన్నారు. భారత్, పాక్ ఉద్రికత్తలపై మీడియా అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు ఈ మేరకు సమాధానమిచ్చారు.
ట్రంప్ గతంలో మాట్లాడుతూ తాను భారత్తో తనకు చాలా దగ్గర సంబంధంఉందని తెలిపారు. అలానే పాకిస్థాన్ కూడా తమకు దగ్గరి సంబంధాలే ఉన్నాయని పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సిందూర్ గురించి భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్లోని పౌర, ఆర్థిక, సైనిక లక్ష్యాలేవీ దెబ్బతినలేదు. ఉగ్రవాద శిబిరాలుగా గుర్తించిన వాటిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాము అని వెల్లడించింది. అంతేకాకుండా, దాడులు జరిగిన కొద్దిసేపటికే, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్.. అమెరికా ఎన్ఎస్ఏ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడి, తీసుకున్న చర్యల గురించి ఆయనకు వివరించారు అని పేర్కొంది.
మంగళవారం అర్ధరాత్రి సుమారు 1.44 గంటలకు భారత్.. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. ఈ దాడుల్లో సుమారు 80 మంది ఉగ్రవాదులు హతం అయినట్లుగా సమాచారం. ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత ప్రభుత్వం పీఓకేలో ఉన్న ఉగ్రస్థావరాలపైన బాంబుల వర్షం కురిపించిందని వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో భారత ఆర్మీ మిగ్ 29కే, రఫేల్ యుద్ధ విమానాలు మిసైళ్లతో దాడులు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఆపరేషన్ సిందూర్కి ముందే భారత ఆర్మీ ఒక వీడియోని విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతేకాక దాడుల తరువాత భారత్, పాక్కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. పరిస్థితిని మరింత దిగజార్చేలా ఎలాంటి చర్యలకు పాల్పడొద్దని దాయాది దేశానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక ఈ ఆపరేషన్ సిందూర్పై కేంద్ర మంత్రులు స్పందిస్తూ.. భారత్ మాతాకీ జై అంటూ పోస్టులు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa