పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చర్యలు కొనసాగిస్తోంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ సహా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఇలా మంగళవారం అర్ధరాత్రి భారత్ ఈ చర్యలు చేపట్టగా.. అమెరికా అప్రమత్తం అయింది. ఈక్రమంలోనే పాకిస్థాన్లో ఉంటున్న తమ దేశ పౌరులకు.. యూఎస్ రాయబార కార్యాలయం పలు హెచ్చరికలు జారీ చేసింది. సాయుధ దళాల సంఘర్షణకు అవకాశం ఉండడంతో భారత్-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు ప్రయాణించకూడదని వివరించింది. అలాగే దాడులు జరిగే ప్రాంతాలకు దగ్గరగా ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని సూచించింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చర్యలు చేపట్టింది. ఓవైపు దాయాది దేశంపై దౌత్యపరంగా చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు మంగళవారం రోజు అర్ధరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో 80 మంది వరకు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుండగా.. అంతర్జాతీయ దేశాలన్నీ దీనిపై స్పందిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. ఈ ఘర్షణలకు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని సూచించారు.
రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధాన్ని ఎవరూ కోరుకోరని అన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాలకు ఎంతో చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఈ రెండు దేశాల మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. ప్రపంచానికి శాంతి మాత్రమే కావాలని, కాబట్టి ఈ గొడవలకు త్వరగా ముగింపు పలకాలని సూచించారు. ఈక్రమంలోనే దీనిపై స్పందించిన అమెరికాలోని భారత రాయబార కార్యాలయం.. దీనికి తగిన సమాధానం చెప్పింది. ఆధారాలు, సాంకేతిక సమాచారం, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగానే.. భారత్ ఈ చర్యలు చేపట్టిందని తెలిపింది. కేవలం ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేసిందని వివరించింది.
ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సిందూర్తో అమెరికా అప్రమత్తం అయింది. ముఖ్యంగా యూఎస్ రాయబార కార్యాలయం పాకిస్థాన్లో ఉంటున్న తమ దేశ పౌరులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. సాయుధ దళాల సంఘర్షణకు అవకాశం ఉన్నందున.. భారత్, పాక్ నియంత్రణ రేఖ సమీప ప్రాంతాలకు ప్రయాణాలు చేయొద్దని సూచించింది. అలాగే పాక్లో దాడులు జరిగిన ప్రాంతాలకు సమీపంగో ఉన్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని సూచించింది. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని వివరించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను క్షణ క్షణం నిశితంగా గమనిస్తున్నామని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa