యాక్సిన్ రెన్యుబవుల్ ఎనర్జీ-బ్రూక్ ఫీల్డ్తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రైతులకు, నిరుద్యోగ యువతకూ మేలు చేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పీక్ అవర్స్లో విద్యుత్ను సగటున రూ.9.38 కు కొనుగోలు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా పీక్ అవర్స్లో కూడా రూ.4.60 కే విద్యుత్ దొరుకుతోందని తెలిపారు. జగన్ 2022లో రూ.5.12కు చేసుకున్న యూనిట్ విద్యుత్ను తాము రూ.4.60కు తగ్గించి ఒప్పందం చేశామని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో సెకీ నుంచి రూ.2.49కు విద్యుత్ కొనుగోలు చేసామనేది పచ్చి అబద్ధమన్నారు.ట్రాన్స్మిషన్ లాసెస్, ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.5పైనే విద్యుత్ కొనుగోలు వైసీపీ హయాంలో జరిగిందని వెల్లడించారు. రాష్ట్ర భూభాగంలో ఏర్పాటు చేసే యాక్సిన్-బ్రూక్ ఫీల్డ్ ద్వారా రైతుల నుంచి దాదాపు 1700 ఎకరాలు లీజు తీసుకుంటుందన్నారు. ఎకరాకు రూ.31 వేలు రైతులకు లీజ్ చెల్లిస్తూ ప్రతీ 2 ఏళ్లకు 5 శాతం ఈ మొత్తం పెంచేలా ఒప్పందం ఉందని తెలిపారు. రాష్ట్రానికి 9 శాతం జీఎస్టీ రూపంలో ఆదాయం రావటంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్ర భూభాగంలో ఏర్పాటు చేసే సంస్థ నుంచే విద్యుత్ కొనుగోలు చేయటం వల్ల ప్రభుత్వ నియంత్రణలోనే అన్నీ ఉంటాయని అన్నారు. గత ఐదేళ్లు రూ.1.25 లక్షల కోట్లు అప్పులు చేసి విద్యుత్ వ్యవస్థను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. గత పాలకులు పెంచిన విద్యుత్ చార్జీలు ఇప్పటికీ ప్రజలు చెల్లించాల్సి వస్తోందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైతే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్న చంద్రబాబు ఆలోచనల్లో భాగంగానే యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్తో ఒప్పందం చేసుకున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa