ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలకు ‘సిందూర్’ అని పేరు పెడుతున్నారు

national |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 08:26 PM

పహల్‌గామ్‌లో 26 మంది పర్యాటకులు చనిపోయారు. అందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ ‘సిందూర్’ చేపట్టి 100 ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మిషన్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొందరు తమ పిల్లలకు ఈ పేరు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా బిహార్‌లోని కతిహార్ జిల్లాలో కుందన్ కుమార్ అనే వ్యక్తి తన కుమార్తెకు 'సిందూర్' అని పేరుపెట్టి దేశభక్తి చాటాడు.కానీ ఆమె పెరిగి పెద్దదైన తర్వాత ఆ పేరుకు ఆర్థం తెలుసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమాయకుల ప్రాణాలను తీయడం ద్వారా దేశానికి హాని కలిగించే పాకిస్థాన్‌లోని ఉగ్రమూకల పీచమణచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్య చేపట్టడం తమకు గర్వంగా ఉందన్నారు. పాపకు ఈ పేరు పెట్డడం పట్ల తమ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారని గుర్తు చేసుకున్నారు. మరోవైపు పాపకు సిందూర్ పేరును ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది సైతం ఆమోదించారని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa