ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడుగురు జైషే ఉగ్రవాదులను హతమార్చిన భారత సైన్యం

national |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 07:56 PM

జమ్మూకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబడేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) తిప్పికొట్టింది. భారత్-పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. మే 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సాంబ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ సంఘటన చోటుచేసుకొన్నట్లు బీఎస్ఎఫ్‌ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఘటనలో కనీసం ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు బీఎస్‌ఎఫ్‌ వర్గాలు వెల్లడించాయి. చనిపోయిన ఉగ్రవాదులంతా జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్నవారని విశ్వసనీయ వర్గాల సమాచారం.


బీఎస్ఎఫ్ వెల్లడించిన దాని ప్రకారం.. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు.. ఇండియా భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించారు. చీకటిగా ఉండటంతో తమ ప్రయత్నాలను ఆర్మీ పసిగట్టే అవకాశం లేదని ఉగ్రవాదులు ఈ సాహసానికి దిగారు. కానీ సర్వేలైన్స్ కెమరాల వారి జాడను పసిగట్టడంతో బీఎస్ఎఫ్ రంగంలోకి దిగి.. ఉగ్రవాదులను అంతమొందించింది.


చొరబాటుదారులను గుర్తించిన వెంటనే బీఎస్ఎఫ్‌ సైనికులు ప్రతిదాడిని ప్రారంభించి ఉగ్రవాదులను అంతమొందించారు. టెర్రరిస్టులకు మద్దతిచ్చిన పాక్‌కు చెందిన ధన్‌బార్‌లోని పోస్టును మన దళాలు ధ్వంసం చేశాయి. ఇందుకు సంబంధించిన థర్మల్ ఇమేజింగ్ దృశ్యాలను కూడా బీఎస్ఎఫ్ విడుదల చేసింది.


ప్రస్తుతం భారత్-పాక్ మద్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మరణించిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతీకారంగా భారత్ మే 7న "ఆపరేషన్ సింధూర్" పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలకు చెందిన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని భారత అధికారులు తెలిపారు


మరోవైపు పాకిస్థాన్ కూడా.. జమ్మూ, పఠాన్‌కోట్,ఉధంపూర్‌లోని భారత సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించి దాడులకు ప్రయత్నించింది. అయితే భారత దళాలు వీటిని సమర్థవంతంగా ఎదుర్కొవడమే కాక ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా.. వాటిని నిర్విర్యం చేశాయని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ వెల్లడించింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం అన్ని సరిహద్దు భద్రతా దళాల డైరెక్టర్ జనరల్‌లతో ఉన్నతస్థాయి సమావేవాన్ని నిర్వమించారు.అలానే దేశవ్యాప్తంగా విమానాశ్రయ భద్రతను సమీక్షించడానికి మరో ప్రత్యేక సమావేశం కూడా జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa