AP: గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత తండ్రిని కొడుకు హత్య చేశాడు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి బేతపూడిలో ఈ ఘటన జరిగింది. శ్రీనివాసనరావు అనే వ్యక్తిని అతని కుమారుడు పరమేశ్ హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శ్రీనివాసరావు వాకింగ్ వెళ్లిన సమయంలో పరమేశ్ దారి కాచి బండరాయితో కొట్టి చంపినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa