ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ రూ.7500 కోట్ల రుణం.. భారత్ వ్యూహాత్మక నిరసన

international |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 09:52 PM

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్‌తో మెరుపు దాడి చేసింది. దీంతో భారత్‌పై పాకిస్థాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. ఇది రెండు దేశాల మధ్య ఘర్షణకు దారితీసింది. భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ.. పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి భారీ ఊరట లభించింది. ఆ దేశానికి 1 బిలియన్ డాలర్ల రుణాన్ని తాజాగా మంజూరు చేసింది. ఈ రుణం, గతంలో అంగీకరించిన 7 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీలో భాగమే. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరపడేందుకు, బాహ్య రుణ భారం తగ్గించుకునేందుకు, విదేశీ మారక నిల్వలను మెరుగుపర్చేందుకు ఇది సహాయపడనుంది. అయితే, ఈ రుణం మంజూరుపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ ఓటింగ్ బాయ్‌కాట్ చేసింది. రుణం మంజూరు కాకుండా ఉండేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలే చేసింది.


ఐఎంఎఫ్-పాకిస్థాన్ మధ్య 2024 మార్చి 25న ఒప్పందం కుదిరింది. మొత్తం 39 నెలల పాటు 7 బిలియన్ డాలర్ల ఈ రుణ ప్యాకేజీలో భాగంగా ఐఎంఎఫ్ షరతులకు పాక్ అంగీకరించింది. అందులో కార్బన్ లెవి, విద్యుత్ ధరల సమయానుకూల సవరణ, నీటి ధరల పెంపు, ఆటోమొబైల్ రంగంలో లిబరలైజేషన్ వంటి కీలక అంశాలు ఉన్నాయి.


భారత్ అభ్యంతరం ఏంటి?


ఐఎంఎఫ్ రుణాలను పాక్ దుర్వినియోగం చేస్తోందని భారత్ ఆరోపించింది. గత 35 ఏళ్లలో 28 ఐఎంఎఫ్ కార్యక్రమాలు చేపట్టినా, మౌలిక సంస్కరణలేమీ జరగలేదు. గత 5 సంవత్సరాల్లోనే 4 బెయిలౌట్లు పొందిన పాకిస్థాన్ ఆర్థిక నిర్వహణలో దారుణంగా ఉంద. ఇలా నిరంతరం సహాయం ఇవ్వడం విశ్వసనీయత కోల్పోయే అవకాశం ఉంని భారత్ అభిప్రాయపడింది.


పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై ఆర్మీ ఆధిపత్యాన్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. పాక్ ఆర్మీకి చెందిన పెద్ద కంపెనీలు (మిలిటరీ రన్ కన్జ్యూమరైట్స్) దేశ ఆర్థిక,వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని, ఇది ఐఎంఎఫ్ సంస్కరణల ఉద్దేశాలకు విరుద్ధమని భారత్ అభిప్రాయపడింది.


కాగా పాకిస్థాన్ ఇప్పటికీ భారత సరిహద్దుల్లో ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్న నేపథ్యంలో, ఆ దేశానికి నిధులు ఇవ్వడం అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధమని భారత్ అభిప్రాయపడింది. ఈ నిధులు ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే ప్రమాదం ఉందని భారత్ హెచ్చరించింది.


ఐఎంఎఫ్ విధానం ప్రకారం సభ్యదేశాలు ‘అంగీకారం’ లేదా ‘మౌనంగా తప్పుకోవడం అనే రెండు ఎంపికలే చూపించాలి. ‘ప్రత్యక్షంగా తిరస్కరించడం’ అనేది ఉండదు. అందువల్ల భారత్ మౌనంగా తప్పుకోవడం ద్వారా తన అభ్యంతరాన్ని గట్టి సంకేతంగా ఐఎంఎఫ్ వేదికకు పంపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa