ఎన్నో నాటకీయ పరిణామాల నేపథ్యంలో టీమిండియా నూతన టెస్టు కెప్టెన్గా ఓ యువ ఆటగాడికి పట్టం కట్టనున్నారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్, విరాట్ కోహ్లి టెస్టులకు గుడ్ బై చెప్పాలనుకోవడం ఇలా టీమిండియాకు వరుస షాక్లు తగిలాయి. ఇన్ని నాటకీయ పరిణామాల తర్వాత మొత్తానికి టీమిండియా నూతన టెస్టు సారథిగా శుభమన్ గిల్కు బీసీసీఐ పట్టం కట్టనుండటం దాదాపు ఖాయమైందనే చెప్పొచ్చు.
టీమిండియా టెస్టు సెలక్షన్ కోసం బీసీసీఐ చాలా కసరత్తులు చేసింది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా నూతన కెప్టెన్తో పాటు నూతన జట్టును కూడా బీసీసీఐ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా టెస్టు కెప్టెన్గా శుభమన్ గిల్ను, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ను నియమించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించనుంది.
టీమిండియా వైస్ కెప్టెన్గా ఉన్న జస్ప్రిత్ బుమ్రాని సారథిగా ప్రకటించాలని అనుకున్నప్పటికీ.. గాయాల బెడద వెంటాడుతుండటంతో బుమ్రాని పక్కన పెట్టాల్సి వచ్చింది. కెప్టెన్గా తీసుకోనప్పుడు, వైస్ కెప్టెన్గా కూడా ఉంచే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
"విరాట్ కోహ్లిని ఇంగ్లండ్ సిరీస్కు టీమిండియా కెప్టెన్గా చేయాలని సెలక్టర్లు అనుకున్న విషయం నిజమే. అయితే, 25 ఏళ్ల శుభమన్ గిల్కు ఇప్పుడే సారథ్య పగ్గాలు అవసరమా అని అనుకున్నారు.. కానీ బుమ్రా ఫిట్నెస్ కారణంగా గిల్కు కెప్టెన్సీ ఇవ్వాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ డిసైడ్ అయింది" ఓ బీసీసీఐ సోర్స్ నేషనల్ మీడియాకి వెల్లడించారు.
జూన్ 24 నుంచి ఇంగ్లండ్తో మొదలయ్యే టెస్టు సిరీస్కు త్వరలోనే టీమిండియా జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఒక వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి టీమిండియా నూతన కెప్టెన్తో పాటు జట్టును కూడా ప్రకటించనున్నారు. ఈ పర్యటన కోసం టీమిండియా ఏ జట్టును కూడా బీసీసీఐ సెలక్ట్ చేస్తోంది. దాదాపు రెండు నెలల పాటు టీమిండియా ఇంగ్లండ్ టూర్లో ఉండనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa