ఇటీవల భారత్–పాక్ మధ్య "ఆపరేషన్ సిందూర్" తర్వాత సైనిక ఘర్షణలను ఆపేందుకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్లోని వేర్పాటువాద సంస్థ బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) స్పందించింది.
ఈ ఒప్పందాన్ని మోసం అనే వ్యాఖ్యలతో, పాకిస్థాన్ మాటలను నమ్మకూడదని భారత్కు సూచించింది. పాక్ నుంచి వినిపించే శాంతి సందేశాలు, కాల్పుల విరమణలు కేవలం తాత్కాలికం మాత్రమేనని, అవి అంతర్ముఖంగా మోసపూరితమైనవేనని BLA ఆరోపించింది.
భారతదేశం పాకిస్థాన్తో సంబంధాలు కొనసాగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా హెచ్చరించింది. గత అనుభవాల ప్రకారమే ఈ జాగ్రత్త అవసరమని BLA వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పాక్ నిజమైన శాంతికి కట్టుబడి ఉండదని, తన స్వలాభాల కోసమే ఈ తరహా చర్యలు తీసుకుంటుందని విమర్శించాయి. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం భారత్–పాక్ సంబంధాల సున్నిత పరిస్థితుల్లో మరింత చర్చనీయాంశంగా మారాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa