ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్' తర్వాత తొలిసారి ప్రధాని ప్రసంగం

national |  Suryaa Desk  | Published : Mon, May 12, 2025, 07:21 PM

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇటీవల భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సిందూర్'ను విజయవంతంగా పూర్తి చేయడం, ఆ తర్వాత పాకిస్థాన్‌తో కీలక కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆపరేషన్ అనంతరం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడటం ఇదే తొలిసారి.గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత సాయుధ బలగాలు 'ఆపరేషన్ సిందూర్' పేరిట ఈ నెల 7వ తేదీన ప్రతిచర్యకు దిగాయి. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్థాన్ భూభాగం, పీఓకేలలో ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిక్షణా శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ సైనిక చర్యలో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.ఈ 'ఆపరేషన్ సిందూర్' ముగిసిన అనంతరం, రెండు రోజుల క్రితం, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల ద్వారా ఎలాంటి సైనిక దాడులకు పాల్పడరాదని, కాల్పుల విరమణ పాటించాలని ఇరు దేశాలు పరస్పరం అంగీకారానికి వచ్చాయి. ఈ శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa