ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉన్న హైదరాబాద్ నగర శివారు ప్రాంతం దుండిగల్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అందుబాటు ధరలో ఇళ్ల కోసం ఇప్పుడు నగర ప్రజలు దుండిగల్ వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం శరవేగంగా కొత్త రూపు సంతరించుకుంటోంది. మల్లంపేట నుంచి బౌరంపేట మీదుగా దుండిగల్ వరకు చూసుకుంటే ఆ మూడు ప్రాంతాలకు మణిహారంగా 12 కిలోమీటర్ల మేర అవుటర్ రింగ్ రోడ్డు ఉంది. దీంతో 20కి పైగా ఉన్నత స్థాయి పాఠశాలలు, నాలుగు ఇంజినీరింగ్ కాలేజీలు, రెండు యూనివర్సిటీలు, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, ఇంటర్ కళాశాలలు బోలేడన్ని అందుబాటులో ఉన్నాయి.
దీంతో గత 10 ఏళ్లలో చూసుకుంటే అక్కడ స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ఇప్పుడు అక్కడం ఎకరం భూమి ధర కోట్లలోకి వెళ్లింది. బహిరంగ మార్కెట్లో రూ.10-15 కోట్ల వరకు ఎకరం పలుకుతోంది. ప్రధాన రహదారులకు ఇరు వైపుల పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. గేటెడ్ క్యూమూనిటీలు వస్తున్నాయి. ప్రైవేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దుండిగల్ పై పడిందని రియాల్టీ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
చ.అ రూ.4 వేలకుపైగా..
మల్లంపేట అవుటర్ రింగ్ రోడ్డు వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ఉంది. ఈ ప్రాంతం బాచుపల్లికి సమీపంలో ఉంది. దీంతో గణనీయమైన అభివృద్ధి సాధించింది. అక్కడ నిర్మించిన మున్సిపాలిటీ, హెచ్ఎండీఏ అనుమతులు గల బహుళ అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీల్లోని అపార్ట్మెంటుల్లో చదరపు అడుగు ధర రూ.4500 వరకు పలుకుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 4 వేలకుపైగా ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. కమర్షియల్ ఫ్లాట్లు గజం ధర రూ.1 లక్ష ఆపైన పలుకుతున్నాయి. లేఅవుట్లలో స్థలం గజం రూ.50 వేల వరకు ఉంది. ఇక గేటెడ్ కమ్యూనిటీల్లో చ.అ. ధర రూ.8-10 వేల వరకు చెబుతున్నారు.
ఇక బౌరంపేటకు అవుటర్ రింగ్ రోడ్డుతో పాటు గండిమైసమ్మ నుంచి బాచుపల్లి వెళ్లే ఆరు వరుసల రహదారి ఉంది. ఇక్కడ 15కుపైగా గుర్తింపు పొందిన స్కూల్స్ ఉన్నాయి. ఒక యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని అపార్ట్మెంట్లలో చ.అ ధర రూ.4500 వరకు పలుకుతోంది. విల్లాలైతే ధర రూ.8-10 వేల వరకు పలుకుతోంది. ప్రస్తుతం 2 వేలకు పైగా అందుబాటు ధరలోని ఇళ్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
ఇక దుండిగల్ పురపాలిక ప్రాంతం గండిమైసమ్మ చౌరస్తా కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. నర్సాపూర్- బాలానగర్ చౌరస్తా నుంచి దుండిగల్ అవుటర్ వరకు వాణిజ్య సముదాయాలు అభివృద్ధి చెందుతున్నాయి. రోడ్డుకు ఇరువైపుల గజం ధర రూ. లక్షకుపైనే ఉంది. దుండిగల్ అవుటర్ ఎగ్జిట్ పాయింట్సహా గాగిల్లాపూర్లో పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిల్లో 10 వేల ఇళ్లకుపైగా అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa