ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభయాన్ పథకం కింద శ్రీ సత్యసాయి జిల్లాలో మూడు తండాలు ఎంపిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 16, 2025, 04:34 PM

జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభయాన్ పథకం కింద శ్రీ సత్యసాయి జిల్లాలోని మూడు తండాలను ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ శుక్రవారం పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంపికైన తండాలు సోమందేపల్లి మండలంలోని నాగి నాయన చెరువు తాండ, తనకల్లు మండలంలోని ముండ్లవారి పల్లి, గాండ్లపెంట మండలంలోని తుమ్మల బైలు తాండాలు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎంపికైన ఈ గ్రామాలలో సమగ్ర అభివృద్ధి కోసం వివిధ చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన, జీవన ప్రమాణాల మెరుగుదల, సామాజిక-ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com