టీడీపీ నేతపై వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ దాడికి పాల్పడ్డారు. ఉద్దండ్రాయునిపాలెంలో రాజు అనే స్థానిక టీడీపీ నేతపై నందిగం సురేశ్, ఆయన సోదరుడు ప్రభుదాసు శనివారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాజు మంగళగిరిలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన బయటకు వచ్చింది. కాగా, అమరావతిలో ఓ మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ దాదాపు మూడు నెలలు జైలులో ఉన్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. ఇప్పుడు టీడీపీ నేతపై దాడితో మరోసారి వార్తల్లో నిలిచారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa