ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త దంపతులు రేషన్ కార్డుకు ,,,,,మ్యారేజ్ సర్టిఫికేేట్ కావాల వద్దా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 07:22 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా పెళ్లై రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు.. ఆధార్‌తో పాటు వివాహ ధ్రువపత్రం జతచేసి సచివాలయాల్లో అందజేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ పొందాలంటే.. పెళ్లికార్డు ఉండాలి. అలాగే దరఖాస్తుకు జత చేసేందుకు కూడా పెళ్లి కార్డు కావాలి. దీంతో చాలామంది మళ్లీ శుభలేఖలను ప్రింటింగ్‌ చేయించుకుంటున్నారు.


మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా పొందాలంటే..


వివాహ ధ్రువీకరణ పత్రం పొందాలంటే.. అప్లై చేసే సమయంలో దరఖాస్తు ఫారానికి భార్యాభర్తల ఆధార్‌ కార్డు, వయసు నిర్ధారణ ధ్రువీకరణ పత్రం, శుభలేఖ, వివాహ సమయంలో తీసుకున్న ఫొటోలు, ముగ్గురు సాక్షులు, కల్యాణ మండపం రసీదు వంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలయంలో పెళ్లి చేసుకుంటే.. దేవాలయం వారు ఇచ్చే రిజిస్ట్రేషన్‌ పత్రం, రూ.500 చలానా జత చేసి సబ్‌రిజిస్ట్రార్‌కు దరఖాస్తు సమర్పించాలి. వారు వివరాలను పరిశీలించి.. అన్నీ కరెక్ట్‌గా ఉంటే.. గంట వ్యవధిలో వివాహ ధ్రువీకరణ పత్రం మంజూరు చేస్తారు.


సచివాలయాల్లో ఎలా పొందాలంటే..


గ్రామాల్లో, పట్టణాల్లో వివాహం చేసుకునే వారు పెళ్లి అయిన వెంటనే సచివాలయాల్లో మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటే మంచింది. అక్కడ వెంటనే మంజూరు చేస్తారు. వివామం జరిగిన వెంటనే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే.. అన్ని వివరాలను పరిశీలించి అక్కడే ధ్రువీకరణ పత్రాలను అందిస్తున్నారు. కానీ గడువు దాటిన వారు మాత్రం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచే పొందాల్సి ఉంటుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ పొందాలంటే..ఫొటోలు, ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లు, పురోహితుడి ధ్రువీకరణ, చలానా చెల్లింపు ఇలా.. మొత్తంగా రూ.1000 వరకు ఖర్చవుతోంది. దీనికి అదనంగా కొందరు రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దళారుల దందాలకు పాల్పడుతూ.. ప్రజల వద్ద రూ.3 వేలకు పైగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


ముస్లిం, క్రిస్టియన్లలో ఆందోళన..


హిందువులు మ్యారేజ్ సర్టిఫికేట్ పొందాలంటే.. డాక్యుమెంట్స్ అన్ని సరిగా ఉంటే.. రోజుల వ్యవధిలో పని పూర్తవుతుంది. కానీ ముస్లిం, క్రైస్తవులు వివాహ ధ్రువీకరణ పత్రం పొందాలంటే.. తక్కువలో తక్కువ రెండు నెలల సమయం పడుతుంది. ముస్లిం, క్రిస్టియన్లు.. మ్యారేజ్ సర్టిఫికేట్‌కు అప్లై చేసుకుంటే.. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను నెల రోజుల పాటు.. నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. దీనిపై ఎటువంటి అభ్యంతరాలు రాకుంటే అప్పుడు ధ్రువీకరణ పత్రం ఇస్తారు. కానీ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం జూన్‌ 7 వరకు మాత్రమే ఉంది. దీంతో ముస్లిం, క్రిస్టియన్ వర్గాల ప్రజలు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు.


మినహాయింపునకు అవకాశం ఉందా..


కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు వివాహ రిజిస్ట్రేషన్‌ పత్రం నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చే అవకాశం ఉందని.. డీఎస్‌వోలు చెబుతున్నారు. ఇటీవల పౌరసరఫరాల కమిషనర్‌తో జరిగిన సమావేశంలో ఈ సమస్యను మంత్రి నాదెండ్ల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రత్యామ్నాయంగా శుభలేఖ, ఫొటో వంటి ఆధారాలు తీసుకునేలా సడలింపు ఇస్తామని తెలిపారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో దరఖాస్తుదారులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.


అయితే ఒక కుటుంబంలో ఉంటూ వేరు కాపురం వెళ్లిన వారు.. తమ కార్డులను విభజించుకోవాలనుకుంటారు. అలాంటి వారి కోసం స్పిల్టింగ్ అవకాశం కల్పిస్తున్నారు. అయితే వారు మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే కొత్తగా పెళ్లైన దంపతులు మాత్రం వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవడం మంచిదని.. ఎప్పటికైనా ఉపయోగమే అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa