ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగంను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు తెగబడిందని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు. చంద్రబాబుకు తెలిసిందల్లా రాజకీయ కక్ష సాధింపు, ప్రతిపక్షంపై అక్రమ కేసులు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల అరెస్టులు మాత్రమేనని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా డీజీ ర్యాంకు అధికారి సహా మాజీ ఐఏఎస్లను కూడా వదలకుండా అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున దుర్మర్గపు పాలనను చూస్తున్నామని అన్నారు. అయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో ప్రతిపక్షంను అణిచివేయడానికి, తప్పుడు కేసులతో భయపెట్టడానికి చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం కక్షసాధించాలనే లక్ష్యంతోనే, సంబంధం లేని అధికారులకు కూడా అవినీతి బురద అంటిస్తున్న చంద్రబాబు దాష్టికాన్ని ప్రజలు ఏవగించుకుంటున్నారు. సీఎంఓలో పనిచేసిన మాజీ ఐఎఎస్ అధికారి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిల అక్రమ అరెస్ట్ నేడు ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి ప్రత్యర్థులను వేధింవచ్చని చంద్రబాబు మాకు నేర్పుతున్నారు. రాజకీయ నాయకులకే పరిమితమైన కేసులను అధికారుల మీద కూడా నమోదు చేసి ఏపీలో పనిచేయాలంటేనే బ్యూరోక్రాట్స్ భయపడేలా చేస్తున్నారు. రెడ్ బుక్ పరిపాలన చూడటానికేనా ఓటేసింది అని ప్రజలిప్పుడు ఆవేదన చెందుతున్నారు అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa