ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విశాఖలో జరగనున్న డిప్యూటీ మేయర్ ఎన్నిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 12:44 PM

విశాఖపట్నం మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11.00 గంటలకు జీవీఏంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. జీవీఏంసీ మేయర్ పదవి ఇప్పటికే టీడీపీ తీసుకుంది. దీంతో డిప్యూటీ మేయర్ పదవి జనసేన పార్టీకి కేటాయించే అవకాశముందని తెలుస్తుంది. ఈ రోజు ఉదయం సీల్డ్ కవర్‌లో అభ్యర్థి పేరును కూటమి నేతలు వెల్లడించనున్నారు. వైసీపీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌‌పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాసం తీర్మానం పెట్టారు. ఇందులో నెగ్గడంతో ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక అనివార్యమైంది.గతంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఏంసీ)కు జరిగిన ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. అయితే ఇటీవల జీవీఏంసీ మేయర్‌ హరి కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇందులో నెగ్గడంతో.. మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. ఇక డిప్యూటీ మేయర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో సైతం కూటమి నెగ్గింది. ఈ పదవి జనసేన పార్టీకి దక్కే అవకాశముందని తెలుస్తోంది.మరోవైపు.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు అంతా కలిసి చర్చించి డిప్యూటీ మేయర్ ఎంపికపై ఓ నిర్ణయానికి రావాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa