ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భయపెట్టి పాలించడం మూర్ఖత్వం: ఎంపీ మిథున్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 03:49 PM

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ వాహనాల రద్దు నిర్ణయం సరికాదని హితవు పలికారు. అలాగే, జగన్ పాలనలో మద్యం కుంభకోణం జరగలేదని స్పష్టం చేశారు. టీడీపీ కట్టుకథలతో మద్యం కుంభకోణం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa