ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సజ్జల భార్గవరెడ్డి ముందస్తు బెయిల్ కి సుప్రీం కోర్టు నిరాకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 01:44 PM

సజ్జల భార్గవరెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నజస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్‌తో ధర్మాసనం సూచించింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం భరించరాని స్థాయికి వెళ్లిందని న్యాయస్థానం పేర్కొంది. ఇలాంటి కేసుల్లో బెయిల్ సులభంగా వస్తే ప్రతి ఒక్కరూ రెచ్చిపోతారని సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తప్పు ఎవరు చేసినా తప్పేనని, ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతం అని ధర్మాసనం పేర్కొంది. ఎవరు తప్పు చేసినా వ్యవస్థ చర్యలు తీసుకోవడం తథ్యమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా సజ్జల భార్గవ్ పిటిషన్‌పై జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్‌తో కూడిన ధర్మాసనం గత గురువారం (ఈ నెల 15వ తేదీ) విచారణ చేపట్టింది. అయితే సీనియర్ న్యాయవాదులు ఎవరు అందుబాటులో లేని కారణంగా ఈ కేసు వాయిదా వేయాలని సుప్రీం ధర్మాసనాన్ని సజ్జల భార్గవ్ తరపు న్యాయవాది కోరారు. అయితే ఎస్సీ, ఎస్టీ కేసు కాబట్టి ట్రయల్ కోర్టుకే వెళ్లాల్సి ఉంటుందని సూచించింది. ఇక్కడ విచారణ కుదరదని తెల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సీనియర్ న్యాయవాది వాదనల కోసం ఈ కేసును వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa