ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో అలజడి రేపుతున్న కరోనా, రెండు కేసులు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 01:47 PM

ఏపీ‌లో కరోనా కేసులు నమోదు కలకలం రేపుతోంది. కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్‌‌లో చేరింది. వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండటంతో అనుమానించిన వైద్యులు గత రాత్రి కరోనా పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సోకినట్లు రిమ్స్ వైద్యులు తేల్చారు. వృద్ధురాలికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఇక కడప జిల్లాలో మరోసారి మొదటిగా ఒక కరోనా కేసు వెలుగులోకి రావడంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న విశాఖలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa