నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో గురువారం మినీ మహానాడు నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎనిమిది తీర్మానాలను మంత్రి ఆనం ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగిందని చెప్పారు. ఆత్మకూరులో సీఎం చంద్రబాబు రెండుసార్లు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సోమశిల డ్యాం మరమ్మతులకు రూ.175 కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుదేనని గుర్తుచేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి . డ్యాం మెయింటెనెన్స్కి గ్రీసు కూడా ఇవ్వని స్థితిలో గత వైసీపీ పాలన సాగిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. ఆత్మకూరులో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని వందపడకల నుంచి 150 పడకలకు పెంచామని చెప్పుకొచ్చారు. సోమశిలలో 30 పడకల ఆస్పత్రిని సీఎం చంద్రబాబు మంజూరు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్ పథకాలు అమలు కాబోతున్నాయని స్పష్టం చేశారు. గతంలో పదివేల సభ్యత్వాలు కూడా లేని పరిస్థితుల నుంచి ఈరోజు లక్ష 50 వేల సభ్యత్వాలు చేసి రాష్ట్రంలో మూడో స్థానంలో నెల్లూరు జిల్లా నిలిచిందని అన్నారు. శాశ్వత సభ్యత్వాల్లో రాష్ట్రంలో రెండోస్థానంలో ఆత్మకూరు నియోజకవర్గం నిలిచిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa