మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆమెతో పాటు నటి రవళి ఫ్యామిలీ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే, రోజా వెంకన్న దర్శనానికి వెళ్తే టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆమెకు రాచమర్యాదలు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఫసక్ అనే ఫేస్బుక్ పేజీలో ఒక ఇమేజ్ పోస్ట్ చేశారు. ఏఈవో వెంకయ్య చౌదరిని అవమానించేలా ఈ పోస్టు ఉంది. దీంతో దీనిపై టీటీడీ స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్నది తప్పుడు ప్రచారమని.. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని, ఫేక్ న్యూస్లను నమ్మొద్దని భక్తులకు టీటీడీ సూచించింది. టీటీడీ అధికారిక ప్రకటనలు మాత్రమే నిజమైనవని, తప్పుడు సమాచారం గందరగోళానికి కారణమవుతుందని తెలిపింది.ఈ మేరకు ఒక ఫ్యాక్ట్ చెక్ వీడియోను టీటీడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో వేద ఆశీర్వచనం టికెట్ కలిగిన భక్తులకు దుప్పట, ప్రసాదాలను ఆలయ పార్ పత్తేదార్ బాలసుబ్రహ్మణ్యం అందజేస్తారని టీటీడీ ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa