ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 10:27 AM

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి. వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. శుక్రవారం శ్రీవారిని 74,374 మంది భక్తులు దర్శించుకోగా 37,477 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా రూ.3.02 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది.వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో గత వారం రోజులుగా భక్తుల తాకిడి పెరిగింది. సాధారణంగా గురువారం ఉదయం తిరుప్పావడ సేవ, సాయంత్రం పూలంగి సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సాధారణంగా రెండు మూడు గంటలు పైగా తగ్గుతుంది. సాధారణంగా కేవలం 62 నుండి 63 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa