ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణదుర్గం.. వ్యక్తిపై దాడి ఘటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 02:45 PM

కళ్యాణదుర్గంలో శుక్రవారం రాత్రి ఓ దాడి ఘటన కలకలం రేపింది. కంబదూరు బైపాస్ రోడ్డులో ఐరన్ షాపు నిర్వహిస్తున్న జితేందర్‌పై రేవన్న, దివాకర్ అనే ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి దుండగులు జితేందర్ షాప్‌లోకి చొరబడి, ముందు జాగ్రత్తగా అక్కడి సీసీ కెమెరాలను ఆపేశారు. అనంతరం అతనిపై తిష్ట వేసి దాడికి పాల్పడ్డారు. దాడి నుండి తప్పించుకొని జితేందర్ బయటకు పరుగెత్తగా, వారు అతనిని వెంబడించి మరల కొట్టినట్టు సమాచారం.
ఈ ఘటనపై బాధితుడు జితేందర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa