ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్తు మందిచ్చి వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

national |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 07:59 PM

ఈమధ్య కాలంలో అమ్మాయిలు ఎవరినీ నమ్మడానికి వీళ్లేకుండా పోతోంది. ఒకేచోట చదువుకునే స్నేహితులు, తెలిసిన వాళ్లు, బంధువులు, పక్కింటి వాళ్లు.. ఇలా ప్రతీ ఓ చోట ఎవరో ఒకరు కామంతో చూసేవాళ్లు. అది ముందుగానే గుర్తించి దూరంగా ఉంటే ఓకే కానీ.. నమ్మి మోసపోయారంటే మాత్రం జీవితమే నాశనం. అచ్చంగా ఇలాగే ఆ వైద్య విద్యార్థిని జీవితం నాశనం అయింది. స్నేహితులతే కదా సినిమాకు వెళ్దామని పిలిస్తే.. సినిమాకు సమయం ఉందంటూ ఫ్లాట్‌కు తీసుకెళ్లి జ్యూస్ ఇచ్చారు. అందులో మత్తు మందు కలిపి స్పృహ తప్పేలా చేసి మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం మహారాష్ట్రలో చోటు చేసుకుంది.


కర్ణాటకలోని బెళగావికి చెందిన 22 ఏళ్ల యువతి.. మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో మూడో ఏడాది చదువుతోంది. మొదటి నుంచి ఈమె తరగతిలో అందరితోనూ కలివిడిగా ఉంటుంది. అయితే ఈమె 18వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో సినిమా చూడాలనుకుంది. తనకు తోడుగా స్నేహితులను కూడా పిలిచింది. ఈక్రమంలోనే ఓ అబ్బాయి వచ్చి తనను పికప్ చేసుకున్నాడు. అయితే మిగతా వాళ్లు తన ఫ్లాట్‌లో ఉన్నారని.. సినిమాకు సమయం ఉంది కాబట్టి కాసేపయ్యాక వెళ్దామని చెప్పాడు. ఇందుకు ఆమె కూడా ఓకే చెప్పి అతడితో పాటు వెళ్లింది.


అయితే ఆమె వారి ఫ్లాట్‌కు వెళ్లేలోపే మరో ఇద్దరు స్నేహితులు అక్కడ మద్యం సేవిస్తున్నారు. యువతిని తీసుకెళ్లిన అబ్బాయి కూడా ఆపై మద్యం సేవిస్తూ.. అమ్మాయికి జ్యూస్ ఇచ్చాడు. అది తాగిన ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ముందు నుంచే అమ్మాయిని అత్యాచారం చేయాలనుకున్న యువకులు.. ఆమెకు మత్తు మందు ఇచ్చి స్పృహ తప్పిన వెంటనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఆమె జీవితాన్ని నాశనం చేశారు. అయితే స్పృహలోకి వచ్చిన తర్వాత తనకు జిరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న అమ్మాయి వారిని ప్రశ్నించింది. కానీ వారు మాత్రం బెదిరింపులకు పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపేస్తామన్నారు.


విపరీతమైన బాధతోనే హాస్టల్‌కు చేరుకున్న ఆమె తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. తన జీవితం నాశనమైపోయిందంటూ కన్నీరు పెట్టుకుంది. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు వెంటనే కుమార్తె వద్దకు వెచ్చి విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ముగ్గురు పుణే, షోలాపూర్, సాంగ్లికి చెందిన వారిగా కూడా గుర్తించగా.. వీరంతా 20 నుంచి 22 ఏళ్ల మధ్యే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే న్యాయస్థానం వీరిని మే 27 తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగించగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa