బంగారం ధరలు గడచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే భారీగా పెరిగాయి. గత సంవత్సరం మే నెలలో బంగారం ధర సుమారు 75 వేల రూపాయల సమీపంలో ఉంటే ప్రస్తుతం అంటే బంగారం ధర దాదాపు 25 వేల నుంచి 30 వేల రూపాయల వరకు పెరిగినట్లు గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ భారీగా పెరగడమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా బంగారానికి ఇంత డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం చైనా అని చెప్పవచ్చు. చైనాకు చెందిన సెంట్రల్ బ్యాంకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా దాదాపు 1000 మెట్రిక్ టన్నుల వరకు బంగారాన్ని గడిచిన 10 సంవత్సరాలలో కొనుగోలు చేసిందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 100 టన్నుల చొప్పున చైనా ఈ బంగారాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 2023 లో మాత్రం చైనా అత్యధికంగా దాదాపు 250 టన్నుల వరకు బంగారాన్ని కొనుగోలు చేసిందని రిపోర్టులు చెబుతున్నాయి ప్రస్తుతం చైనా వద్ద దాదాపు 2300 టన్నుల బంగారం అందుబాటులో ఉంది. చైనా గడచిన పది సంవత్సరాల్లో విపరీతంగా బంగారం కొనుగోలు చేసింది. ముఖ్యంగా చైనా తన పెట్టుబడులను ఎక్కువగా బంగారం రూపంలో నిలువ చేసుకునేందుకు ఇష్టపడింది. దీనికి ప్రధాన కారణం అమెరికా డాలర్ పైన ఎక్కువగా ఆధారపడకుండా ఉండేందుకు చైనా ఈ నిర్ణయం తీసుకుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు ఇతర ఎసెట్ క్లాసెస్ తో పోల్చి చూసినట్లయితే, బంగారం అనేది చాలా సురక్షితం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతింటున్న నేపథ్యంలో చైనా ఎక్కువగా బంగారం పై పెట్టుబడులను పెంచుకుంటూ పోయింది. దీనికి తోడు పశ్చిమ దేశాల పైన ఆధారపడకుండా ఉండాలంటే ఆర్థికంగా బలపడేందుకు తన పెట్టుబడులను బంగారం పైన ఎక్కువగా పెట్టేందుకు చైనా మొగ్గు చూపింది. ఫలితంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకడం ప్రారంభించాయి. గడచిన పది సంవత్సరాలలో చూసినట్లయితే బంగారం ధర దాదాపు మూడు రెట్లు పెరిగింది అని చెప్పవచ్చు. గత ఐదు సంవత్సరాలలో బంగారం ధర దాదాపు రెట్టింపు అయింది. కరోనా అనంతరం చైనా బంగారం నిల్వలను మరింత పెంచుకునేందుకు ఆసక్తి చూపించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చైనా ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి చూస్తున్నట్లయితే చైనా వృద్ధిరేటు భారీగా తగ్గింది అని చెప్పవచ్చు దాదాపు 3 శాతం మేర తగ్గినట్లు గుర్తించవచ్చు. అలాగే చైనా పారిశ్రామిక ప్రగతి కూడా తగ్గుతుంది దీనికి ప్రధాన అమెరికా విధించిన సుంకాల కారణంగా, ప్రస్తుతం చైనా ఆర్థిక ప్రగతి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో చైనాలో నిరుద్యోగం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా యాపిల్ వంటి సంస్థలు చైనా వదిలిపోతున్నాయి. దీంతో నిరుద్యోగం పెరుగుతోంది. ఫలితంగా చైనా ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే బహిరంగ మార్కెట్లో చైనా తన బంగారు నిల్వలను విక్రయిస్తే , మార్కెట్లో భారీగా ధరలు తగ్గే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ చైనా బంగారం నిల్వలను విక్రయిస్తే దాని పసిడి ధరలు సుమారు 20 శాతం మేర తగ్గే అవకాశం ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు టైమ్స్ నౌ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు. టైమ్స్ నౌ తెలుగు తన పాఠకులకు డబ్బు, పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa