రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి నగరంలోని కృష్ణాపురం ఠాణా నుండి ఇందిరామైదానం వరకు సాగిన ఈ ర్యాలీలో తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, కమిషనర్ ఎన్. మౌర్య తదితరులు పాల్గొన్నారు. ప్రజలలో ఆరోగ్యంపై చైతన్యం కల్పించే ఉద్దేశంతో ఈ ర్యాలీ ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa