కడప వేదికగా మహానాడు మంగళవారం ప్రారంభంకానుంది. ఈ మహానాడుకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణలకు చెందిన ప్రత్యేక వంటకాలను రుచి చూపించనున్నారు. ఇక చాలాకాలం అనంతరం మహానాడులో మాంసాహారం సైతం వడ్డించనున్నారు. మొదటి రెండు రోజులు రెండు లక్షల మందికిపైగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అలాగే మహానాడు బహిరంగ సభ ముగింపు రోజు.. అంటే గురువారం బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు ప్రాంగణంలో రెండు లక్షల మందికి ఆహారం అందిస్తూనే.. బయట నలుదిక్కులా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. వాటిలో సుమారు మూడు లక్షల మందికి భోజనాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.ప్రతిరోజూ భోజనాల్లో 20 రకాల వంటకాలకు తగ్గకుండా ఈ మహానాడుకు హాజరయ్యే వారికి వడ్డించనున్నారు. సుమారు 1,700 మంది వంటవారు.. మరో 800 మందిని వడ్డింపునకు నియోగించనున్నారు. ఇక స్వీట్స్లో.. తాపేశ్వరం కాజా, అల్లూరయ్య మైసూర్పాక్, చక్కెర పొంగలి, ఫ్రూట్ హల్వా తదితర మిఠాయిలు సిద్ధం చేస్తున్నారు. 50 వేల కొడిగుడ్లు వడ్డించనున్నారు. మరోవైపు మహానాడు ఆవరణలోని వంటశాలను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే సందర్శించి.. భోజన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వంట వారికి పలు కీలక సూచనలు సైతం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa