ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖఉక్కు ప్రైవేటీకరణ ఆపేయ్యాలంటూ నిరసనకు దిగిన కార్మికులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 12:05 PM

విశాఖఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉక్కు కర్మాగారం కాంట్రాక్టు కార్మికుల నిరావధిక సమ్మె మంగళవారం ఉధృతంగా మారింది. గత వారం రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్న ఉక్కు కాంట్రాక్టు కార్మికులు ఈ రోజు ఉదయం ఉక్కు అడ్మిన్ భవనం ముట్టడికి యత్నించారు. వందలాదిమంది ఉక్కు కాంట్రాక్టు కార్మికులు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు.. పోలీసులకు మధ్య తోపులాట జరిగడంతో కార్మికుల నాయకుడు భాస్కర్‌‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతనిని ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa