ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడపలో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 04:31 PM

కడప నగరంలో టీడీపీ మహానాడు సందర్భంగా జాతీయ నాయకుల విగ్రహాలకు సర్కిళ్లకు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ తోరణాలు, జెండాలు కట్టి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు.  కడప నగరంలోని వైయ‌స్ఆర్‌, అంబేద్క‌ర్‌, గాంధీజీ వంటి మ‌హానీయుల విగ్ర‌హాల‌కు కట్టిన పసుపు జెండాలను వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో పార్టీ శ్రేణులు తొల‌గించారు. పాత కలెక్టరేట్‌ సర్కిల్‌, వన్ టౌన్ పోలీస్ పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గర గల వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహాల‌కు క్షీరాభిషేకం చేసి నివాళుల‌ర్పించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని, టీడీపీ కవ్వింపు చర్యలకు దిగడం సరికాదని పి.రవీంద్రనాథ్ రెడ్డి హిత‌వు ప‌లికారు. కార్య‌క్ర‌మంలో కడప నగర మేయర్ కె.సురేష్ బాబు గారు, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజద్ బాషా పాలాభిషేకం చేశారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు, అనుబంధ సంఘాల నాయకులు, నాయకురాలు, పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa