టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వయస్సులో పెద్ద వారు కానీ హార్ట్లో చాలా యంగ్ అంటూ ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చమత్కరించారు. ఆయనలాగా ఎవరు యోగా చేయలేరన్నారు. కడపలో మహానాడు మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ నేతలతో మంత్రి నారా లోకేశ్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తాను, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శావాసనం వేస్తే హాయిగా నిద్రపోవచ్చునని భావించామన్నారు. మహిళలను గౌరవించాలన్నారు. ముందు తమ భాషను మార్చుకోవాలంటూ రాజకీయ నాయకులకు ఆయన కీలక సూచన చేశారు. ఎందుకంటే సమాజంలో రాజకీయ నాయకులను అత్యధికంగా ఫాలో అవుతున్నారన్నారు. అందువలన రాజకీయ నాయకులు తమ భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.యువగళంలో భాగంగా రాయలసీమలో తాను పాదయాత్ర చేసినప్పుడు తనకా మార్పు స్పష్టంగా కనిపించిందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. తన తల్లి ఎంత ఆవేదన చెందిందో తాను కళ్ళారా చూశానన్నారు. కానీ వైఎస్ జగన్ కుటుంబంలో ఎవరిని కూడా తాము ఒక్క మాట అనలేదన్నారు. తమ వాళ్లు ఎవరు ఏమైనా మాట్లాడినా తాము ఊరుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa