ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్, డీజిల్ ధరలపై అప్పుడు చెప్పిన మాటలు,ఇప్పుడు చెప్పడంలేదే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 29, 2025, 01:18 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో పెట్రో ధ‌ర‌ల వ్య‌త్యాసాల‌ను స్వ‌యంగా ప‌రిశీలించి సోష‌ల్ మీడియా ద్వారా వాస్త‌వాల‌ను వెలుగులోకి తెచ్చి ఇదిగో పెట్రోల్ పై లోకేష్ చేసిన మోసం అంటూ టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వ నేతలని వైయ‌స్ఆర్‌సీపీ తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త భూమ‌న అభిన‌య్‌రెడ్డి ప్రశ్నించారు.  తెల్ల‌వారుజామునే క‌ర్ణాట‌క బార్డ‌ర్‌, ఏపీలోని కుప్పంలో పెట్రోల్ ధ‌ర‌లు తెలుసుకొని, ఆ వివ‌రాల‌ను సోష‌ల్ మీడియాలో భూమ‌న అభిన‌య్‌రెడ్డి వెల్ల‌డించారు.ఎన్నికల ముందు నారా లోకేష్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, దానికి వైయ‌స్ జగన్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌కి వెళ్లి, బంక్‌ల దగ్గర నిలబడి, దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉన్నాయి, ఇది వైయ‌స్ జగన్ విధానాల వైఫల్యం’ అంటూ అప్ప‌ట్లో లోకేష్ నానాయాగీ చేశాడు. అంతే కాకుండా మేం అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం కానీ పెంచమ‌ని హామీ ఇచ్చారు .టీడీపీ కూట‌మి ప్రభుత్వం ప్ర‌భుత్వం ఏర్పాటై ఏడాది అవుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు త‌గ్గించ‌క‌పోగా, పెంచుతూనే ఉన్నారు.  దేశంలోనే మన రాష్ట్రంలో అత్యధికంగా పెట్రో ధ‌ర‌లు ఉన్నాయి. ఒక్క పైసా కూడా పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గించ‌లేదు అని మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa