ప్రధాని మోదీ తనపై చేసిన విమర్శలపై పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ స్పందించారు. తక్షణమే సాధారణ ఎన్నికలు నిర్వహించాలంటూ మోదీకి సవాల్ విసిరారు. పహల్గామ్ దాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అఖిలపక్ష ప్రతినిధులు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న సమయంలో ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబేనా? అని ప్రశ్నించారు. "మనమంతా ఒక్కటే" అనే సందేశాన్ని ఇస్తున్న టైంలో ప్రధాని విడదీసే ప్రయత్నం చేయడం బాధాకరమని అన్నారు.రాష్ట్రంలో హింస జరుగుతున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు.మార్పు కావాలని బెంగాల్ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ‘‘టీచర్ నియామకాల్లో కుంభకోణం జరిగింది. వేలాది మంది కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. బెంగాల్ విద్యావ్యవస్థ నాశనం అయింది. టీఎంసీ నేతలు ఎన్నో నేరాలు చేశారు. కానీ, వారి తప్పులను అంగీకరించడానికి బదులుగా న్యాయవ్యవస్థలు ఇచ్చిన తీర్పులను తప్పు పడుతున్నారు. పేదల హక్కులు హరిస్తున్నారు. నిరుద్యోగంతో రాష్ట్ర యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇకనైన బుజ్జగింపు రాజకీయాలు, గూండాయిజానికి స్వస్తి పలకండి’’ అని మోదీ హితవు పలికారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన దీదీ అసహనం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa