కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాట్లాడుతూ, తిరుమలేశుని తొలి గడప అయిన కడపలో మహానాడు జరగడం జిల్లావాసులకు దక్కిన గౌరవమని అన్నారు. "అశేషంగా వచ్చిన జనాలను చూస్తే కడప గడ్డ తెలుగుదేశం అభిమానుల అడ్డా అని రుజువైంది" అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన పార్టీ అని అన్నారు. చంద్రబాబు అంటే పట్టుదల, క్రమశిక్షణ, నేర్పు, ఓర్పుకు నిదర్శనమని, అభివృద్ధి అంటే ఆయన పేరే గుర్తుకు వస్తుందని కొనియాడారు. "పోలవరాన్ని పూర్తి చేసి కృష్ణా నీటిని బనకచర్ల వరకు తీసుకువస్తే రాయలసీమ అభివృద్ధిని ఆపే శక్తి ఎవరికీ లేదు. చంద్రబాబు ముందుచూపు వల్లే నేడు రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో ఎంతో మంది రైతు బిడ్డలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు" అని వివరించారు. గతంలో తనపై వ్యక్తిగత దాడులు జరిగాయని గుర్తుచేస్తూ, టీడీపీ కార్యకర్తను టచ్ చేస్తే అదే వారి చివరి తప్పు అవుతుందని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa