ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 06:08 AM

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడొచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, ఆగ్నేయ రాజస్థాన్ నుంచి ఉత్తర మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయవ్య బంగాళాఖాతంలోని వాయుగుండం కేంద్రం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. అటు, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది నేటి మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ దీవి, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య తీరం దాటింది.మరోవైపు, నైరుతి రుతుపవనాలు దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. బంగాళాఖాతంలోని వాయుగుండం పరిస్థితులు కూడా రుతుపవనాల కదలికలకు తోడ్పడుతున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa