చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా, రాయలసీమకు తీరని ద్రోహం చేశారని, ఆ ప్రాంత ప్రజలంటే ఆయనకు ఎప్పుడూ చిన్న చూపే అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆక్షేపించారు. ఇప్పుడు కూడా రాయలసీమకు అన్యాయం చేస్తూ ఎయిమ్స్, ఆంధ్రప్రగతి బ్యాంక్ను అమరావతికి తరలించారని సాకే శైలజానాథ్ గుర్తు చేశారు. చంద్రబాబు పరిపాలనలో ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి దూరమయ్యారు. సినిమా రిలీజ్కు డేట్లు ఇచ్చినట్టు సంక్షేమ పథకాలకు డేట్లు ప్రకటించడమే తప్ప, ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదు. పథకాల అమలు గురించి మహానాడులో స్పష్టమైన ప్రకటన వస్తుందనుకున్న ప్రజలకు నిరాశే మిగిలింది. ప్రజలకు ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పుకోకుండా తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు జగన్ని తిట్టడమే సరిపోయింది. సామాన్య ప్రజలే కాదు తండ్రీకొడుకుల సొంత డబ్బా చూసి టీడీపీ కార్యకర్తలు సైతం విసిగిపోయారు. మహానాడు జరిగిన తీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ వారసునిగా కొడుకు లోకేష్ను చేసేందుకు చంద్రబాబు మహానాడు వేదికగా ప్రయత్నించినట్లు ప్రతి ఒక్కరికీ అర్థమై పోయింది. ఎన్టీఆర్ పేరు వాడుకోవడమే తప్ప, ఆయన పేరు నిలబెట్టే నిజాయితీ చంద్రబాబులో లేదు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa