ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్య, వైద్య రంగాలని చంద్రబాబు నిర్వీర్యం చేసాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 12:25 PM

తెలుగు దేశం పార్టీ మహానాడులో ఆ పార్టీ  వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఘోర అవమానం జరిగింద‌ని, ఆయ‌న ఆత్మ ఘోషిస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి అన్నారు. కార్యకర్తలను ఆకర్షించేందుకు మొక్కుబడిగా ఎన్టీఆర్‌ జపం చేసే చంద్రబాబు నాయుడు.. మహానాడులో ఆయనకు భారతరత్న ఇచ్చే విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేద‌ని త‌ప్పుప‌ట్టారు. శుక్ర‌వారం చిత్తూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..`చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో ప్రజలకు చేసింది ఏమి లేదు. మ్యానిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేశాడు. చంద్రబాబు పాలనలో విద్య, వైద్యం ను నిర్వీర్యం చేశాడు. మద్యం బెల్ట్ షాపులు ద్వారా వీధి వీధి లో అందుబాటులో తెచ్చి ప్రజలు జీవితాలు నాశనం చేశారు. ఏపీ ను మద్యం ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు. రాష్ట్రంలో దళితులు కు రక్షణ లేదు, ఏడాది కాలంలో ఎన్నో దాడులు జరిగాయి సీఎం చంద్రబాబు ఏ ఒక్క విషయంలో స్పందించలేదు. దళితులను బౌతిక దాడులు జరుగుతున్నాయి, సామాజిక బహిష్కరణ చేస్తున్నా పోలీసులు స్పందించడం లేదు. మహానాడు వేదికగా చంద్రబాబు మరోసారి అబద్ధాలు చెప్తూ ప్రజల్ని, టిడిపి నాయకులు కార్యకర్తలు ను మోసం చేశారు.దివంగత నేత ఎన్టీఆర్ ఆత్మ ఘోసిస్తోంది . ఎక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు చెప్పిన అబద్ధాలు విని నవ్వుకుంటున్నారు. మహానాడు వేదికగా ఆత్మ గౌరవాన్ని చంపుకుని టీడీపీ నాయకులు,కార్యకర్తలు అక్కడ కూర్చుని ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలు గురించి ఎక్కడ మాట్లాడలేదు. పేదవాడు కు ఆంగ్ల విద్య ను దూరం చేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేట్ పరం చేస్తున్నారు. రాష్ట్రం లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. నార్త్ కొరియాలో కిమ్ నియంత పాలన తరహా ఏపీ లో సాగిస్తున్నారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమాన్ని నేరుగా అందించారు. రాష్ట్ర ప్రజలు ప్రతి విషయాన్ని తేడాను గమనిస్తున్నారు. కూట‌మి నేత‌లు కులం చూసి పాలన సాగిస్తున్నారు. ప్రజలు ఇప్పటికైనా మేలుకోండి..పేదవాడిని చంద్ర‌బాబు చులకనగా చూస్తున్నాడు. ఎస్సీలు రెండు వర్గాలుగా చీల్చాడు.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్ రెడ్డి, వంశీ లను అరెస్టు చేసి కక్ష్య సాధింపు చర్యలు కు దిగుతున్నారు` అంటూ నారాయ‌ణ‌స్వామి మండిప‌డ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa