ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకేష్ అసమర్థతతో విద్యాశాఖ నిర్విర్యమౌతోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 02:16 PM

రాష్ట్రంలో పదోతరగతి పరీక్షల మూల్యాంకనం ప్రక్రియను సైతం సమర్థంగా నిర్వర్తించలేని దుస్థితిలో విద్యాశాఖ ఉందని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నారాయణ కాలేజీల్లో అడ్మీషన్లు పెంచేందుకు మొక్కుబడిగా మూల్యాంకనం నిర్వహించి, ప్రతిభగల విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అసమర్థతతో తన శాఖను నిర్వర్తిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అయన మాట్లాడుతూ..... కూటమి పాల‌న‌లో విద్యావ్య‌వ‌స్థ పూర్తిగా భ్ర‌ష్టుప‌ట్టిపోయింది. హాఫ్ ఇయ‌ర్లీ ప‌రీక్ష‌ల నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల వ‌ర‌కు పేప‌ర్ లీకేజీ జ‌ర‌గ‌కుండా ప‌టిష్టంగా ప‌రీక్ష‌ల ప్రక్రియ  నిర్వ‌హించ‌లేక ప్ర‌భుత్వం చేతులెత్తేసింది. ఇటీవ‌ల నిర్వ‌హించిన ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌ల్లోనూ పేప‌ర్ లీక్‌ల‌తో ప్ర‌భుత్వం అభాసుపాలైంది. ఇదిలా ఉంటే చివ‌రికి పేప‌ర్ మూల్యాంక‌నంలోనూ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. మార్చి 2025లో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 1,15,874 మంది ఫెయిల‌య్యారు. వారిలో రిలో 66,363 మంది విద్యార్థులు రీకౌంటింగ్‌, రీ వేల్యూష‌న్‌కి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఫెయిలైన వారిలో దాదాపు 60 శాతం మంది మా జ‌వాబు ప‌త్రాలను త‌ప్పుల త‌డ‌క‌గా మూల్యాంక‌నం చేశార‌ని ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఎస్సెస్సీ బోర్డు చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థమం. రీవేల్యూష‌న్, రీకౌంటింగ్‌ త‌ర్వాత దాదాపు 11 వేల మంది ఉత్తీర్ణులైన‌ట్టు ఎస్సెస్సీ బోర్డు ప్ర‌క‌టించింది. ఇదంతా చూస్తుంటే మూల్యాంక‌న విధానం ఎంత లోప‌భూయిష్టంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మోక్షిత అనే విద్యార్థినికి సాంఘిక‌శాస్త్రంలో 21 మార్కులేశారు. రీకౌంటింగ్ కి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే 84 మార్కులొచ్చాయి.  బాప‌ట్ల‌లో మ‌రో విద్యార్థికి సాంఘిక శాస్త్రంలోనే 26 మార్కులొస్తే రీవెరిఫికేష‌న్ త‌ర్వాత 96 మార్కులొచ్చాయి. ఏలూరులో ఒక విద్యార్ధి రాసిన  జ‌వాబు ప‌త్రాల‌న్నీ మూల్యాంక‌నం చేయ‌కుండా 14 మార్కులే వేశారు. రీ వేల్యూష‌న్‌లో ఆ విద్యార్ధినికి 86 మార్కులొచ్చిన‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు. ఇలాంటి తప్పులకి పాల్పడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa