ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయ భూములని సైతం కూటమి వదలటం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 02:24 PM

రాష్ట్రంలో దేవాదాయశాఖ భూములను తమ బినామీల పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లీజుల ముసుగులో తమకు కావాల్సిన వారికి కారుచౌకగా దేవాలయ భూములను అడ్డతోవలో ధారాదత్తం చేసేందుకే ప్రభుత్వం ఆఘమేఘాల మీద జీఓ 139ని జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ భూముల లీజులకు సంబంధించి న్యాయస్థానాలు నిర్ధేశించిన మార్గదర్శకాలను కూడా ఉల్లంఘిస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయన మాట్లాడుతూ..... కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని త‌న‌కు న‌చ్చిన వారికి కారు చౌక‌గా దేవుడి భూములు క‌ట్టబెట్టేందుకు సిద్దమైంది. దాతలు స్వామివారి నైవేద్యం కోసం ఆలయాలకు విరాళంగా ఇచ్చిన‌ భూముల‌ను క్యాబినెట్‌ ఆమోదం లేకుండా, వేలం నిర్వ‌హించ‌కుండా కావాల్సిన వారికి నేరుగా పందేరం చేసేందుకు ప్ర‌భుత్వం పచ్చజెండా ఊపింది. సేవా సంస్థల ముసుగులో నచ్చిన వారికి, తోచిన ధరకు ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకు అప్పగించేందుకు ఈ నెల 2న‌ ప్రభుత్వం జీవో నంబర్‌ 139 విడుదల చేసింది. అంతేకాకుండా ప్ర‌స్తుత లీజు దారుల‌కు మ‌రో 33 ఏళ్లు లీజు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణ‌యం న్యాయ‌స్థానాల ఆదేశాల‌ను లెక్క‌చేయ‌క‌పోవ‌డమే. దేవాదాయ శాఖ భూముల‌ను లీజుకు ఇవ్వాలంటే టెండ‌ర్ విధానం ద్వారా బ‌హిరంగ వేలం నిర్వ‌హించి ఎవ‌రు ఎక్కువ‌కు కోట్ చేస్తే వారికివ్వాలి. వ్య‌వ‌సాయేత‌ర భూముల‌ను 33 ఏళ్ల‌కు మించి లీజుకు ఇవ్వ‌కూడ‌ద‌ని కోర్టులు గ‌తంలోనే స్ప‌ష్టంగా చెప్పినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. దేవాదాయ శాఖ భూముల‌ను త‌న వారికి అప్ప‌నంగా క‌ట్ట‌బెట్టేందుకు న్యాయ‌స్థానాల ఆదేశాల‌ను సైతం ఉల్లంఘిస్తున్నారు అని మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa