ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కొక్కరికీ రూ.15 వేలు, జూన్ 15లోపు అకౌంట్లలోకి డబ్బులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 03:43 PM

ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లోనే పాఠశాలలు ఓపెన్ కానున్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడిగా ఉన్న పథకాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అని పేరు మార్చింది. అయితే ఈ తల్లికి వందనం పథకాన్ని జూన్ నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఒక ఇంట్లో ఎంత మంది చదువుకునే విద్యార్థులు ఉంటే వారికి ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున వారి తల్లుల అకౌంట్లలో నగదు జమ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు చేయనుంది అనేదానిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటన చేశారు.


తాజాగా పెన్షన్ల పంపిణీ భాగంగా తన సొంత నియోజకవర్గం పాయకరావుపేటలోని నక్కపల్లి మండలంలోని ఉద్ధండపురం గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లు రీ ఓపెన్ అయ్యేలోపు అంటే జూన్ 15వ తేదీ లోపు తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని మరోసారి తేల్చి చెప్పారు. లబ్ధిదారులైన పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున వారందరికీ డబ్బులు జమ చేయనున్నట్లు వంగలపూడి అనిత వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa