ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకి ఏమి చేసామో చెప్పుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 01:09 PM

ఎండీయూ ఆపరేటర్లపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు అని వైయస్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ధ్వజమెత్తారు. సీఎం స్థాయిలో ఉండి ఇంత దిగజారుడు వ్యాఖ్యలా? అంటూ మండిప‌డ్డారు.అయన మాట్లాడుతూ.... మహానాడు పేరుతో ప్రతి సంవత్సరం ఎన్టీఆర్‌ ఆత్మని క్షోభకు గురిచేస్తున్నారు. చంద్రబాబుని ఎన్టీఆర్‌ ఔరంగజేబు, రావణాసురుడుతో పోల్చితే ఏఐ టెక్నాలజీ వాడుకుని పొగిడించుకోవడం సిగ్గుచేటు. వారి దిగజారుడుతనానికి నిదర్శనం. నందమూరి కుటుంబ సభ్యులెవర్నీ మహానాడుకి పిలవకుండా ఎన్టీఆర్‌ పేరును వాడుకుంటున్నారు. ప్రజలు ఇదంతా తెలియని అమాయకులని తండ్రీకొడుకులు భావిస్తే అంతకన్నా అవివేకం ఉండదు. మూడు రోజుల మహానాడు మొత్తం ఆత్మస్తుతి, పరనింద తప్ప, ప్రజలకు ఏడాదిలో ఏం చేశామో చెప్పుకోలేని దుస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఏడాది గడిచినా సూపర్‌ సిక్స్‌లో ఒక్క హామీని కూడా నెరవేర్చింది లేకపోయినా 30 ఏళ్లు మనమే ఉంటామని చెప్పడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. టీడీపీ నాయకులకు ప్రజల గడప వద్దకు వెళ్లే ధైర్యం కూడా లేదు. మహానాడుకి జనం కరువైపోతే డ్వాక్రా మహిళలు రాకపోతే పథకాలు కట్‌ చేస్తామని బెదిరించారు.  ప్రతినెలా రూ.4 వేల పింఛన్‌ పంపిణీ కార్యక్రమం పేరుతో చంద్రబాబు లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నాడు. వేదిక మీదకు నలుగురు పేదవారిని పిలిచి వారికి మైకులు పెట్టి డ్రామా నడుపుతున్నాడు. ఏడాదిగా కనీసం ఒక్క కొత్త పింఛన్‌ కూడా పంపిణీ చేయకుండా ఇలాగే కాలక్షేపం చేశాడు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పింఛన్‌ పంపిణీ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు, ఎండీయూ వాహనాలు నడుపుకునే పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మీద దారుణమైన ఆరోపణలు చేశాడు. నెలకు రూ.10 వేల వేతనం తీసుకునే రేషన్‌ వాహనాల డ్రైవర్లు లంచాలు ఇవ్వడానికి తన వద్దకే వచ్చినట్టు చంద్రబాబు దారుణమైన అభాండాలు వేయడం సిగ్గుచేటు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి దిగజారి ఆరోపణలు చేయడం బాధాకరం అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa