ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెన్త్‌ పరీక్షల నిర్వహణలో కూటమి విఫలం స్పష్టంగా కనబడుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 01:24 PM

టెన్త్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో తండ్రీకొడుకులు చంద్ర‌బాబు, లోకేష్ పూర్తిగా ఫెయిల్ అయ్యార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. వారి అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలు ఎదుర‌వుతున్నాయ‌న్నారు.  పదో తరగతి మూల్యాంకనంలో జ‌రిగిన తప్పుల‌ను వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా స్పందిస్తూ... చంద్ర‌బాబు గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌  టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa