ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నేతలపై, కార్యకర్తలపై పెట్టే ప్రతి అక్రమ కేసుకి సమాధానం కచ్చితంగా ఉంటుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 02:03 PM

రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన పరాకాష్టకు చేరిందని, ఏడాది పాలనకే కూటమి  ప్రభుత్వానికి ప్రజలు పాడెకట్టే పరిస్థితిని తెచ్చుకున్నారని వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. నెల్లూరు సెంట్రల్ జైల్ లో  మైనింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆయన పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులను బనాయించి వైయస్ఆర్‌సీపీ నేతలను అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఒక అరాచక పాలనను సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే గత ప్రభుత్వంలో మేం కూడా చేసి ఉంటే చంద్రబాబు మూడునెలలకే జైలుకు వెళ్ళేవారని అన్నారు. అధికారం ఉందని ఇప్పుడు నమోదు చేస్తున్న అక్రమకేసుల పర్యవసానాలు తరువాత తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని చంద్రబాబు, లోకేష్‌లు గ్రహించాలని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa