ఆంధ్రప్రదేశ్లో పేదలకు మళ్లీ రేషన్ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిపోయిందని విమర్శించారు.
"ఇంటి వద్దకే రేషన్ అందించే విధానాన్ని ప్రభుత్వం నిలిపివేయడం వల్ల లక్షలాది మంది పేద ప్రజలకు తిరిగి కష్టాలు మొదలయ్యాయి," అని అంబటి ఆరోపించారు. ముఖ్యంగా డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేయడం ద్వారా దాదాపు 20 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన చెప్పారు.
అంతేకాకుండా, "ప్రభుత్వం ఉద్యోగులతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వారిని ఎలా తొలగించగలదు?" అంటూ ఆయన ప్రశ్నించారు. "ఇది చంద్రబాబు నాయుడి ఉద్యోగాలు తొలగించే విధానం" అని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఆయన ప్రభుత్వం తక్షణమే డోర్ డెలివరీ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవస్థ పేదలకు అందుబాటులో ఉండేలా చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa