ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు, పవన్ లు కేవలం మాటలకే పరిమితం అయ్యారు, చేతల్లో చేసింది శున్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 03:41 PM

ఆంధ్రప్రదేశ్‌లో చాలా గ్రామాలకు మంచి నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. బొట్టు పెట్టుకుని సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ తాగునీటి గురించి ఎందుకు మాట్లాడరంటూ ఆయన ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు చెబుతారే తప్ప.. గ్రామాలలో తాగునీటి గురించి స్పందించరా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఒండ్రుమట్టి నీళ్లు తాగుతున్న గ్రామాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయని ఈ సందర్బంగా గుర్తు చేశారు. 2025-26 బడ్జెట్‌లో కూడా సాగు, తాగు నీటి అవసరాలకు నిధులు కేటాయించ లేదన్నారు.అమరావతి, పోలవరం గురించి తెగ ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసు ఎత్తడం లేదని పేర్కొన్నారు. గోదావరి, బనకచర్ల పేర్లు చెప్పి రూ. వేల కోట్లు అప్పులు చేయాలని ఆలోచన చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగు నీరు లేక వలసలు పోతున్న గ్రామాల గురించి, అక్కడ ప్రజలు గురించి మాట్లాడటం లేదన్నారు. ఇప్పటికే ఏడాది పాలన పోయింది.. నిధులు ఇవ్వకపోవడంతో.. మరో యేడాది కూడా ఇదే పరిస్థితి దాపురిస్తోందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa