ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరుకుంటున్న నీరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 04:04 PM

శ్రీశైలం ప్రాజెక్టుకు రోజు రోజుకు కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు వరదనీరు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో.. 30.797 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో నిల్.. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు.. కాగా ప్రస్తుతం నీటిమట్టం : 829.80 అడుగులు ఉంది. పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్థ్యం : 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం: 49.3230 టీఎంసీల నీరుంది. కాగా ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయగా, విద్యుత్‌ ఉత్పాదనతో 26,817 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. మొత్తంగా 31,162 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాం వైపునకు వస్తుండగా, 36,740 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. ఎంజీకేఎల్‌ఐ కాల్వ ద్వారా 416 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. దీంతో శనివారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను, 828.20 అడుగులకు చేరింది. 215.807 టీఎంసీల సామర్థ్యానికి గాను 47.7648 టీఎంసీల నీటి నిల్వలు నమోదు అవుతున్నట్లు డ్యాం గేజింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో 1,095 క్యూసెక్కుల నీటితో 0.484 మిలియన్‌ యూనిట్లు, కుడి గట్టు కేంద్రంలో 638 క్యూసెక్కులు నీటిని వినియోగించి 0.291 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పాదన చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం నిల్వ నీటి నుంచి 2,310 క్యూసెక్కుల నీరు అవుట్‌ ఫ్లో కొనసాగుతున్నదని శనివారం డ్యాం అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa