థియేటర్ల బంద్, పర్సంటేజీల వ్యవహారంపై ప్రముఖ నటులు ఆర్. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేష్లను ఉద్దేశించి నారాయణమూర్తి చేసిన కామెంట్స్పై ప్రముఖ నిర్మాత, దర్శకులు నట్టి కుమార్ స్పందించారు. ఆర్ నారాయణమూర్తి వెనుక ఉన్నది ఎవరో బయట పెడతానని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో నట్టికుమార్ మీడియాతో మాట్లాడారు. ఆర్. నారాయణమూర్తి పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేష్లను తప్పుపట్టారని మండిపడ్డారు. గతంలో సినీప్రముఖులు.. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డితో జరిగిన సమావేశానికి నారాయణమూర్తి కూడా వెళ్లారని గుర్తుచేశారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవిని, మిగతా పెద్దలను అవమానించినప్పుడు నారాయణమూర్తి ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. చిన్న సినిమాకు ఐదో షో ఇప్పించలేనప్పుడు.. జగన్, కేసీఆర్ హయాంలో వారికి దగ్గరగా ఉన్నప్పుడు నారాయణమూర్తి ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa