ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో ఒకటైన “తల్లికి వందనం” పథకాన్ని జూన్లో ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు రూ.15,000 నగదును నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
కానీ ఒక ముఖ్యమైన షరతు ఉంది…
ఈ ఆర్థిక సాయం అందుకోవాలంటే తల్లుల బ్యాంక్ ఖాతాలు తప్పనిసరిగా:
ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి
NPCI (National Payments Corporation of India) తో కూడా లింక్ అయి ఉండాలి
ఇవీ జూన్ 5వ తేదీలోపు పూర్తయి ఉండాలి. లేకపోతే డబ్బు వారి ఖాతాలోకి జమ కాకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కడ లింక్ చేయించుకోవచ్చు?
లింకింగ్ ప్రక్రియను తల్లి దారులు ఈ క్రింది ప్రాంతాల్లో పూర్తి చేయవచ్చు:
తమ బ్యాంక్ శాఖ
పోస్టాఫీస్
గ్రామ / వార్డు సచివాలయం
అందువల్ల, ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటున్న తల్లులు వెంటనే ఈ లింకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa