ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం తెనాలిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, పోలీస్ వ్యవస్థ వికృత రూపం దాల్చిందని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, "ఏప్రిల్ 24న తెనాలిలో ఒక కానిస్టేబుల్ సివిల్ డ్రెస్సులో వచ్చి కొందరితో గొడవ పెట్టుకున్నాడు. ఈ ఘటనలో జాన్ విక్టర్ మరియు అతని స్నేహితులు జోక్యం చేసుకొని పరిస్థితిని సమసిప్తా చేయడానికి ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని రౌడీ షీటర్లుగా ముద్రవేసి, నడిరోడ్డుపై కూర్చోబెట్టి కొట్టారు. గొడవను అడ్డుకోవడమే వారు చేసిన తప్పా?" అని ప్రశ్నించారు.
పోలీస్ వ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ ఘటన రాష్ట్రంలో చట్టం మరియు సురక్షిత వాతావరణం లోపించాయనడానికి నిదర్శనమని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa